మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
NEWS Mar 28,2026 04:17 pm
నర్సంపేట మున్సిపాలిటీ 16వ వార్డులో మహిళలకు ఇందిరమ్మ చీరలను మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, వార్డు కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.