వైభవంగా రాములోరి కల్యాణోత్సవం
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
NEWS Mar 27,2026 02:10 pm
భద్రాచలం: శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. మిథిలా మండపంలో జరిగిన ఈ క్రతువును తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున స్వామి వారికి సీఎం రేవంత్రెడ్డి, గీత దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంత్రులు పాల్గొన్నారు. 351 కోట్లతో చేపట్టే భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ చేశారు.