బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన బావ
NEWS Mar 26,2026 05:08 pm
అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో బాలుడి అపహరణ విషాదాంతమైంది. ఏడేళ్ల వేంచంద్రను అతని బావ బోయ సర్వేశ్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కుందనకోటకొండలో మృతదేహాన్ని పడేసినట్లు గుర్తించారు. అత్తమామలు గౌరవం ఇవ్వలేదనే కక్షతో ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు. పాఠశాల సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.