సీఎంలతో సమావేశం కానున్న మోదీ
NEWS Mar 26,2026 05:04 pm
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంతో ప్రధాని మోదీ మార్చి 27న వర్చువల్గా సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్న మోదీ.. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల సన్నద్ధత, సహకారంపై చర్చించనున్నట్లు సమాచారం.