'FLS సర్వే విజయవంతం చేయాలి'
NEWS Mar 26,2026 04:52 pm
జిల్లాలో ఈ నెల 30, 31 తేదీలలో నిర్వహించనున్న ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని డీఈవో బి. నాగలక్ష్మి సూచించారు. భద్రాచలం ఉపాధ్యాయ విద్యా కళాశాలలో శిక్షణ పొందుతున్న చాత్రోపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ.ఈ సర్వే ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్, ప్రిన్సిపాల్ భవాని తదితరులు పాల్గొన్నారు.