ప్రకాశం: మార్కాపురం (మం) రాయవరం వద్ద ఈ ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఎదురెదురుగా ఢీకొని 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 26 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. 6గురి పరిస్థితి విషమం, టిప్పర్ ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం జరిగింది. 2 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు. నిర్మల్ (తెలంగాణ) నుంచి నెల్లూరు (ఏపీ)కు బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.