మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు
NEWS Mar 26,2026 08:41 am
ఇటీవల భారీ స్థాయిలో పడిపోయిన పసిడి, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేడు (8.30 సమయం) వరకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,680గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,460గా ఉంది. కిలో వెండి రూ.2,60,100కు పెరిగింది.