అమిత్ షాకు 'ఉనిక' పుస్తకం అందించిన
చెన్నమనేని విద్యాసాగర్ రావు
NEWS Mar 25,2026 05:43 pm
ఢిల్లీ: మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తన ఆత్మకథ “ఉనిక” పుస్తకాన్ని అమిత్ షాకు అందించారు. వీరు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. చెన్నమనేని విద్యాసాగర్ రావు తన సుదీర్ఘకాల ప్రజాజీవితంలో ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి, మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసిన అనుభవాలను “ఉనిక” ఆత్మకథలో విశదీకరించారు.