డిసిసి అధ్యక్షులను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..
NEWS Mar 25,2026 11:17 pm
నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జునైద్ మెమన్, కార్యదర్శి ఖిజర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బొజ్జు పటేల్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతం, జిల్లా స్థాయి రాజకీయ పరిణామాలపై పరస్పరం చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమాంద్ అలీ, రాజురా సత్యం, మైనార్టీ పట్టణ అధ్యక్షులు మతిన్ తదితరులు పాల్గొన్నారు.