రోడ్డు డివైడర్లో మొక్కలు నాటే కార్యక్రమం
NEWS Mar 25,2026 03:45 pm
లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీ, బావోజీ తండా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు దుర్గా భవాని, నూతక్కి భవాని ఆధ్వర్యంలో సర్పంచ్ వి. హథీరామ్ పర్యవేక్షణలో రోడ్డు డివైడర్లో మొక్కలు నాటారు. శ్రీరామ నవమి సందర్భంగా రోడ్డు శుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల సంరక్షణకు సహకరించాలని కోరారు.