విద్యుత్ బస్సులు ఆర్టీసీకే ఇవ్వాలి: CITU
NEWS Mar 25,2026 03:45 pm
సీఐటీయూ పిలుపు మేరకు కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యుత్ బస్సులను ప్రైవేటుకు ఇవ్వకుండా ఆర్టీసీయే కొనుగోలు చేయాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల బకాయిలు చెల్లించాలని, పని భారం తగ్గించాలని, బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. ప్రైవేటీకరణ వల్ల డిపోలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో భూక్య రమేష్, లిక్కి బాలరాజు, వంకుడోత్ కోబల్, NS రాజు, నాగేశ్వర రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.