'కరోనా విషాదాలను మోదీ మరచిపోయారు'
NEWS Mar 24,2026 07:50 pm
పశ్చిమాసియా సంక్షోభాన్ని కరోనాతో పోలుస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కొవిడ్ సమయంలో చోటుచేసుకున్న ఘటనలను, విషాదాలను ఆయన మరచిపోయారని విమర్శించారు. భారత విదేశాంగ విధానం మోదీ పర్సనల్ పాలసీలా మారిపోయిందని ఆరోపించారు. ప్రధాని రాజీపడ్డారంటే మన విదేశాంగ విధానమూ రాజీపడినట్లేనని అన్నారు.