ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండకు తరలివస్తున్నారు. హనుమాన్ దీక్షలు చేపట్టిన స్వాములు అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు, ఉప ఆలయాలైన బేతాళ, రామాలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.