ఐ.ఐ.టి నేషనల్ లెవెల్ 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
NEWS Mar 24,2026 02:05 pm
మెట్ పల్లిలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ విద్యార్థులు ఐఐటి నేషనల్ లెవెల్ పరీక్షలో ప్రతిభ కనబరిచి 12 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా సన్మానించింది. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయాన్ని సాధించారని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు