బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ముందస్తు అరెస్టు
NEWS Mar 23,2026 01:40 pm
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. నిన్న రాత్రి నుండి ప్రారంభమైన ఈ రోజు ఉదయం వరకు ఈ ముందస్తు అరెస్ట్ లు కొనసాగాయి.
ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ను ఈ రోజు ఉదయం పాల్వంచ శ్రీనగర్ కాలనీ లోని ఇంటి వద్ద పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.