బీజేపీ శ్రేణుల ముందస్తు అరెస్ట్
NEWS Mar 23,2026 01:35 pm
చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన మల్యాల మండల బీజేపీ నాయకులను ఇవాళ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు గాజుల మల్లేశం మాట్లాడుతూ.. నేటి చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పోలీసుల అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచిస్తోందని ఆరోపించారు. ఆరు హామీలను బీజేపీ కచ్చితంగా నిలదీస్తుందని, అసెంబ్లీ ముట్టడి కచ్చితంగా జరుగుతుందని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, మద్దుట్ల సర్పంచ్ తిరుపతి, సాయి, పరమేష్ వున్నారు.