దివ్యాంగులకు పెళ్లి - ఆశీర్వాదాలు
NEWS Mar 22,2026 05:45 am
దిల్సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయ ట్రస్ట్ సహకారంతో, శాంతి దివ్యాంగుల సంఘం చైర్మన్ శ్రీ గిరి రజినీ ఆధ్వర్యంలో 55వ దివ్యాంగుల పెళ్లి నిర్వహించారు. వరుడు రామకృష్ణ - వధువు సౌందర్యల పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరైన GBN ఎలైట్ ఉపాధ్యక్షుడు సందగళ్ళ మధుసూధన్ గౌడ్ నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందజేశారు. కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్న ఈ జంటకు ఇంటి అవసరాల కోసం తన వంతుగా రూ. 5,000 ఆర్థిక సహాయం అందించారు.