రికార్డు ధరల్లో చికెన్ ధరలు
NEWS Mar 22,2026 10:32 am
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. రంజాన్ మాసం, పెళ్లిళ్ల సీజన్, వేసవి తీవ్రత కారణంగా వారం క్రితం రూ.330 ఉన్న స్కిన్లెస్ చికెన్ ఇప్పుడు రూ.380–400కు చేరింది. నాటుకోడి ధరలు రూ.800 వరకు పెరిగాయి. సప్లై తగ్గడం, పౌల్ట్రీలో కోళ్ల మరణాలు పెరగడం ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు. మటన్ ధరలు కూడా రూ.1000 దాటడంతో సామాన్యులు చికెన్కు బదులుగా గుడ్లు, చేపలు, రొయ్యల వైపు మొగ్గు చూపుతున్నారు.