ఏపీలో నంది అవార్డులు ఇస్తాం: మంత్రి
NEWS Mar 21,2026 10:45 pm
విశాఖ: ఏపీలో నంది అవార్డులు త్వరలోనే ఇస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కళాకారులకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని వెల్లడించారు. సినిమా నటీనటులకు అవార్డులు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నామన్నారు. సినీ నిర్మాణాలకు పలు అందమైన లోకేషన్లు విశాఖలో ఉన్నాయని, నిర్మాణ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా వాటిని ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు.