సీనియర్ జర్నలిస్టుకు రంజాన్ శుభాకాంక్షలు
NEWS Mar 21,2026 05:04 pm
వరంగల్: నర్సంపేట పట్టణంలో సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ ఇమ్రాన్ (సుమన్ టీవీ)ను పలువురు జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జర్నలిస్టులు తౌటి శ్రీకాంత్, పెండ్యాల రమేష్, బేరోజు రాణా ప్రతాప్, కేశరాజు సాయి కుమార్, చెట్టి రమేష్, తౌటి ప్రభాకర్, సబ్బని రమేష్ తదితరులు పాల్గొన్నారు. పండుగలు సామాజిక ఐక్యతను పెంపొందించే వేదికలని వారు అభిప్రాయపడ్డారు.