టీజీ సెట్ అర్హత సాధించిన శ్రీలత
NEWS Mar 21,2026 05:08 pm
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG SET–2025) ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయగా, పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కుదిర శ్రీలత అర్హత సాధించి ప్రతిభ చాటుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో 29 సబ్జెక్టులకు 18 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో మొత్తం 2,565 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ పరీక్షలో కుదిర శ్రీలత 152 మార్కులు సాధించి అర్హత పొందడం విశేషం. ఈ సందర్భంగా ఆమెకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు మరియు విద్యావేత్తలు అభినందనలు తెలియజేశారు.