'రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలి'
NEWS Mar 21,2026 10:29 am
అరకు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర పర్యటనను విజయవంతం చేయాలని ఎగువశోభ పంచాయితీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మట్టం శ్యామ్ కోరారు. అనంతగిరి మండలంలోని ఎగువశోభ పంచాయితీ పరిధిలోని మర్దగుడ, హెక్టగూడ, దండబాడు, అనంతగిరి, పెద్దూరు గ్రామాల్లో శనివారం నిర్వహించే “రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి దొన్నుదొర హాజరవుతారని తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.