కనిపించిన నెలవంక.. రేపే రంజాన్
NEWS Mar 20,2026 09:28 pm
రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ముగిశాయి. నేడు భారత్లో నెలవంక కనిపించింది. దీంతో దేశవ్యాప్తంగా ముస్లింలు శనివారం రంజాన్ పండగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21న సాధారణ సెలవు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షల అనంతరం ఈ వేడుక జరుపుకుంటారు ముస్లిం సోదరులు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ 'ఈద్-ఉల్-ఫితర్' అని భావిస్తారు.