జగన్ అన్యాయం చేశాడు: విజయమ్మ
NEWS Mar 20,2026 04:44 pm
వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య గత ఆస్తుల వివాదంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. ఆస్తుల విషయంలో చెల్లెలు, ఆమె పిల్లలు (మేనల్లుడు, మేనకోడలు)కు జగన్ అన్యాయం చేశాడని, ఆస్తుల పంపకం జరగలేదని, YSR ఉన్నంత కాలం ఉమ్మడి ఆస్తులేనని అన్నారు. తన ఆస్తులన్నీ నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా పంచాలన్నది YSR ఉద్దేశం, జగన్ MOUలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను.. అని అన్నారు.