కథలాపూర్ గ్రామపంచాయతీలో ఇఫ్తార్
NEWS Mar 19,2026 05:02 pm
కథలాపూర్ గ్రామపంచాయతీలో కోరుట్ల జామాత్-ఇ-ఇస్లామీ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. రంజాన్ మాసం ప్రత్యేకతను వివరించి, దేశంలో హిందూ-ముస్లింల ఐక్యతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ముస్లింలు ఉపవాసాలు చేసి ప్రార్థనలు చేసుకునే పవిత్ర కాలమని చెప్పారు. మహమ్మద్ పసియుద్దీన్ షకీల్, ఇలియాస్ అహ్మద్ ఖాన్, నహీముద్దీన్, షేక్ హుస్సేన్, మసూద్, సర్పంచ్ శేఖర్, ఉప సర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.