జగిత్యాల జిల్లాలో విషాదం. మోతె గ్రామంలో కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి చెందింది. దొడ్ల సంపత్(25) అప్పుల బాధతో గడ్డి మందు తాగాడు. కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కొడుకు మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన తల్లి మల్లవ్వ(55) అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్ ఆస్పత్రి (జగిత్యాల)కి తరలించగా గుండెపోటుతో మృతి చెందింది.