ఇరాన్కు భారత్ మానవతా సాయం
NEWS Mar 18,2026 01:38 pm
అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్ దేశానికి భారత్ మానవతా దృక్పథంతో అండగా నిలిచింది. యుద్ధం వల్ల మందుల కొరతతో ఎదుర్కొంటున్న ఆ దేశానికి అత్యవసర వైద్య సామాగ్రితో కూడిన తొలి విడత సాయాన్ని అందించింది. ఈ సాయం ఇరాన్కు చేరినట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. కష్టకాలంలో ఆదుకున్నందుకు భారత ప్రజలకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది.