నిధుల బకాయిలపై నిరసన హెచ్చరిక
NEWS Mar 17,2026 11:49 pm
బొర్రా గుహలు వద్ద సర్పంచ్ అప్పారావు, ఎంపీటీసీ అరుణ నవీన్ కలిసి మేనేజర్ గౌరీశంకర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొర్రా గుహల ఆదాయంలో 20 శాతం గ్రామపంచాయతీ అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పి, 2012 నుంచి 2026 వరకు సుమారు రూ.8 కోట్లు చెల్లించలేదని ఆరోపించారు. తక్షణమే పర్యాటక శాఖ బకాయిలు చెల్లించకపోతే గ్రామపంచాయతీ తీర్మానంతో శనివారం నుంచి బొర్రా గుహలను మూసివేసి సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, పెసా కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.