బస్సు బ్యాటరీల దొంగ అరెస్ట్
NEWS Mar 17,2026 06:36 pm
నర్సంపేట పట్టణంలో నిలిపి ఉన్న అద్దె బస్సుల్లో బ్యాటరీలను ఎత్తుకెళ్లిన దొంగను నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన కత్తెరపల్లి చందు ఆటోలు 4 బ్యాటరీలను తరలిస్తుండగా వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆటోలో బ్యాటరీలను గుర్తించిన పోలీసులు విచారించగా బస్సుల్లోని బ్యాటరీలను దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడని సిఐ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రవికుమార్, అరుణ్, సిబ్బంది పాల్గొన్నారు.