ప్రతినెలా రూ.3,000 పెన్షన్ రావాలంటే..
NEWS Mar 17,2026 02:05 pm
చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో భరోసా కల్పించేందుకు కేంద్రం ‘PM-Kisan Maandhan Yojana’ను అమలు చేస్తోంది. 18-40ఏళ్ల మధ్య వయసున్న రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 చొప్పున పొదుపు చేయాలి. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. రైతు మరణిస్తే భాగస్వామికి 50% పెన్షన్ అందిస్తారు. రైతులు ఆధార్, బ్యాంక్ వివరాలతో ‘మీసేవ’, CSC కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చు.