24 గంటల్లో వస్తువులు డెలివరీ
లేకపోతే డబ్బులు వాపస్
NEWS Mar 17,2026 01:48 pm
వినియోగదారులకు స్పీడ్ డెలివరీని అందించడమే లక్ష్యంగా ఇండియా పోస్ట్ ‘24 స్పీడ్ పోస్ట్’, ‘48 స్పీడ్ పోస్ట్’ పేర్లతో కొత్త సర్వీసులను తీసుకొచ్చింది. ముందుగా హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఈ సదుపాయం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. వస్తువులు పోస్టు చేసిన మరునాడే డెలివరీ అవ్వకపోతే పేమెంట్ తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. OTPతో డెలివరీ తీసుకోవచ్చు.