సోషల్ మీడియా స్టంట్ వీడియో కోసం చేసిన ప్రమాదకర ప్రయత్నం ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్న ఘటన ఢిల్లీలో జరిగింది. పవన్ (28) తన కజిన్ హిమాన్షు లైసెన్స్డ్ పిస్టల్తో స్టంట్ చిత్రీకరిస్తూ ఛాతిపై తుపాకీ పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలగా ఆసుపత్రిలో మృతి చెందాడు. పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.