అక్రమ మొరం తరలింపును
అడ్డుకున్న పాలితం గ్రామస్థులు
NEWS Mar 17,2026 01:30 pm
పెద్దపల్లి మండలం పాలితం గ్రామంలో అక్రమంగా జరుగుతున్న మొరం తరలింపును గ్రామస్థులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా జేసీబీ సహాయంతో మట్టి తవ్వకాలు నిర్వహించి, టిప్పర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు. పెద్దపల్లికి చెందిన కొంతమంది నాయకులు ఇష్టారాజ్యంగా ఈ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని, వెంటనే అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలని అధికారులను గ్రామస్తులు కోరారు.