'అనిమేష' కవి నందిని సిధారెడ్డికి
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
NEWS Mar 16,2026 10:25 am
ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థి తులే ఇతివృత్తంగా రాశారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్గా పని చేశారు. ఆధునిక తెలుగు కవిత్వంలో సిధారెడ్డి ఎన్నో పరిశోధనలు చేసి, తెలుగు సాహితీ రంగానికి విశిష్ఠ సేవలు అందించారు.