ఆస్కార్ వేదికపై కోటకు నివాళి
NEWS Mar 16,2026 02:58 pm
ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినీకళామతల్లి మెరిసింది. 98వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా గతేడాది లోకం విడిచి వెళ్లిన చేసిన సినీ ప్రముఖులకు నివాళులర్పించే ప్రత్యేక విభాగంలో తెలుగు వెండితెర విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు చోటు లభించింది. ఈ గౌరవం పొందిన నలుగురు భారతీయ తారలలో కోట ఒకరు. అకాడమీ స్మరించుకున్న భారతీయ తారల్లో మొదటగా కోట శ్రీనివాస రావు ఉన్నారు. కోట మొత్తం 9 నంది అవార్డులతో పాటు భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని సైతం అందుకున్నారు.