ఘనంగా మాలజంగాల మహాసభ
NEWS Mar 15,2026 04:04 pm
మాలజంగం కులధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారానే జారీ చేయాలని తమ డిమాండ్ మేరకు ఎస్సీ ఉపకులాలందరికీ త్వరలో తహసీల్దార్ ద్వారా ధ్రువపత్రాలు ఇవ్వనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చారని 57 MBSC కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బైరి వెంకటేశం తెలిపారు. హైదరాబాద్లో మాలజంగం కుల భవనం నిర్మాణం, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, శైవక్షేత్రాల్లో మాలజంగం పూజారులకు నియామకం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మాలజంగం మహేశ్వర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు పర్శ శ్యామ్ రావు అధ్యక్షతన మాలజంగాల మహాసభ ఘనంగా జరిగింది.