నిర్మల్ మున్సిపాలిటీలోని 9వ వార్డులో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో పలు వీధులు చీకటిమయంగా మారాయి. ఈ సమస్యను కాలనీ వాసులు వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన కౌన్సిలర్ వెంటనే చర్యలు తీసుకుని వీధి దీపాలను మరమ్మతు చేయించి ఏర్పాటు చేయించారు. దీంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.