ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రానున్న 6 నెలల్లో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు ప్రకటన చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.