నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
NEWS Mar 14,2026 12:19 am
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 5,17,727మంది రెగ్యులర్, ఒకసారి ఫెయిలైన 10,512మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు పాఠశాల నుంచి అత్యధికంగా 2,50,015 విద్యార్థులుండగా, ప్రభుత్వ బడుల నుంచి 2,07,573 మంది, సంక్షేమ గురుకులాల నుంచి 60,139 మంది విద్యార్థులు ఉన్నారు.