తమిళనాట శశికళ కొత్త పార్టీ ప్రకటన
NEWS Mar 13,2026 05:03 pm
దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ (చిన్నమ్మ) 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. 'ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం' పేరుతో పార్టీని ఏర్పాటు చేసి, కొబ్బరి చెట్ల సమూహాన్ని గుర్తుగా ఎంచుకున్నారు. ఈ పార్టీ తమిళనాడులో ముఖ్యంగా అన్నాడీఎంకే ఓట్లను చీల్చి, రాజకీయ సమీకరణాలను మార్చగలదని అంచనా.