సూర్యోదయ హైస్కూల్లో ఇఫ్తార్
NEWS Mar 12,2026 10:03 pm
మెట్పల్లి: శ్రీ సూర్యోదయ హైస్కూల్లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం విద్యార్థులకు ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించారు. ఉపవాసాన్ని ముగించుకునే సందర్భంలో పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. స్కూల్ కరస్పాండెంట్ రాజ్కుమార్, ప్రిన్సిపాల్ విజయ్కుమారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అరుణ్ దీప్ గౌడ్, నిఖిల్ కుమార్, మనోజ్ కుమార్ పాల్గొని విద్యార్థులతో కలిసి ఇఫ్తార్లో భాగస్వాములయ్యారు. పరస్పర సౌహార్దం, ఐక్యతను పెంపొందించుకోవాలని సూచించారు.