పదో తరగతి విద్యార్థులకు సర్పంచ్ సహాయం
NEWS Mar 12,2026 12:17 pm
ఖానాపూర్ మండలం దబిర్పేట గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు గ్రామ సర్పంచ్ ధనసరి సురేష్ పెన్నులు, పెన్సిల్లు, ప్యాడ్లు పంపిణీ చేశారు. ఫైనల్ పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.