కల్తీ పాలు: పెరుగుతున్న మృతుల సంఖ్య
NEWS Mar 12,2026 11:12 am
రాజమండ్రి: లాలాచెరువు ప్రాంతంలో చోటుచేసుకున్న కల్తీ పాల ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందడంతో, మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 7గురు బాధితులు ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. అడ్డాల గణేశ్వరరావు (నరసాపురం) నిర్వహించే 'వరలక్ష్మి మిల్క్ సెంటర్' నుండి పాలు కొనుగోలు చేసిన 20 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.