ప్రపంచ కుబేరుల్లో మస్క్, ముకేశ్
NEWS Mar 12,2026 10:04 am
'ఫోర్బ్స్' మ్యాగజైన్ ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 9,970 కోట్ల డాలర్ల సంపదతో భారత్, ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా తన పీఠాన్ని పదిలం చేసుకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆయనది 21వ స్థానం. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 6,380 కోట్ల డాలర్ల నికర ఆస్తితో దేశంలో రెండో స్థానం. టెస్లా బాస్ ఎలాన్ మస్క్ 83,900 కోట్ల డాలర్ల ఆస్తితో ఆయన వరుసగా రెండో ఏడాది ప్రపంచ నంబర్ వన్ ధనవంతుడిగా నిలిచాడు.