పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
NEWS Mar 11,2026 07:11 pm
గీసుగొండ మండలం కొనాయమాకుల స్టేజ్ వద్ద వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గీసుగొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మామూనూర్ ఏసీపీ వెంకటేష్ ప్రారంభించారు. గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్సైలు కుమార్, అనిల్, స్థానిక సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రయాణికులు, స్థానిక ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం లక్ష్యమని పోలీసులు తెలిపారు