మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామ శివారులోని సాగర్ కుంటలో మొసలి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. మొసలి నీటిలో సంచరిస్తున్నట్టు గుర్తించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అటవీ శాఖ అధికారులు స్పందించి మొసలిని పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.