కోరుట్లలో విద్యార్థిని చితకబాదిన టీచర్
NEWS Mar 11,2026 01:32 pm
కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ విద్యార్థిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 5వ తరగతి చదువుతున్న సాత్వీక్ అనే విద్యార్థిని మంగళవారం ఓ ఉపాధ్యాయురాలు కర్రతో కొట్టడంతో శరీరంపై రక్తం గడ్డ కట్టిన గాయాలు ఏర్పడ్డాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్కూల్లో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో చిన్నపాటి గొడవ జరగడంతో కోపోద్రిక్తురాలైన టీచర్ సాత్వీక్పై దాడి చేసిందని తెలిపారు. ఇలాంటి విషయాలను తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాల్సింది పోయి విచక్షణ రహితంగా కొట్టడం తగదని విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.