పార్టీ మారినట్లు ఆధారాలు లేవు
దానం, కడియంలకు క్లీన్చిట్!
NEWS Mar 11,2026 11:29 am
HYD: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు వెలువరించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవన్నారు. ఈ అంశంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో స్పీకర్ నేడు నిర్ణయం వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొన్న 10 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు.