ఆపరేషన్ క్రాక్డౌన్లో 208 మంది అరెస్ట్!
NEWS Mar 10,2026 10:11 pm
తెలంగాణలో సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న వారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0' పేరుతో ఫిబ్రవరి 25న ప్రారంభించిన ఈ రాష్ట్రవ్యాప్త ఆపరేషన్లో 208 మందిని అరెస్ట్ చేసినట్లు TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఏడుగురు విద్యార్థులు, 15 మంది మహిళలు, ఇద్దరు లెక్చరర్లు, విద్యుత్ శాఖ ఉద్యోగి ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ మోసాలకు సంబంధించిన నగదు బదిలీలకు ఉపయోగించే 'మ్యూల్ ఖాతాల'పై ఈ ఆపరేషన్ కేంద్రీకరించింది. నిందితులు 5% వరకు కమీషన్ తీసుకుని తమ బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించినట్లు దర్యాప్తులో తేలింది.