బోనాల వేడుకలో అగ్ని ప్రమాదం
NEWS Mar 10,2026 09:54 pm
ఖానాపురం మండలం చిలకమ్మనగర్ గ్రామ పరిధిలోని గోవింద్ తండాలో బోనాల వేడుక సందర్భంగా అగ్ని ప్రమాదం జరిగింది. దుర్గమ్మ గుడి పండుగలో భాగంగా బోనాలు పెట్టి హిజ్రాలు నృత్యాలు చేస్తున్న సమయంలో గుండంలో పెట్రోల్ పోయగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి అక్కడున్న పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.